Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో లింకు పెట్టుకుని తల్లిని వేధిస్తున్నాడనీ.. కన్నతండ్రిని చంపేసిన కుమార్తె

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (11:47 IST)
పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన తండ్రి.. కన్నతల్లిని వేధించడాన్ని కన్నబిడ్డ సహించలేక పోయింది. దీంతో తల్లితో కలిసి తండ్రిని చంపేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా రవీంద్రనగర్‌లో జరిగింది. 
 
శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రవీంద్రనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కోడ సముద్రయ్య(48)కి భార్య నాగలక్ష్మి, కుమార్తె బిబాషా ఉంది. వీరంతా కలిసి నివశిస్తున్నారు. అయితే, గత యేడాది నుంచి ఒంటరిగా ఉంటున్న మహిళతో సముద్రయ్య సహజీవనం చేయసాగాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరుగుతూ వచ్చాయి. సహజీవనం చేస్తున్న మహిళను నేరుగా గురువారం ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. 
 
తాను ఇంటికి తీసుకొచ్చిన మహిళను భార్య దూషించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సముద్రయ్య... భార్యను చితకబాదాడు. అడ్డుకోబోయిన కుమార్తెను కూడా కొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కూతురు కత్తితో తండ్రిని పొడిచి అనంతరం సహజీవనం చేస్తున్నా మహిళపై కత్తితో దాడి చేసింది. కన్న తండ్రి ఘటనా స్థలంలోనే మృతి చెందగా సదరు మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కూతురు బిబాషా, ఆమె తల్లి  నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments