Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైలు నుంచి పడిన ప్రేమికులు.. మాట్లాడుతూ..?

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:41 IST)
Train
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన కారుణ్య అనే 24 ఏళ్ల మహిళ కదులుతున్న రైలు నుంచి పడి తీవ్ర గాయాలపాలైన ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. 
 
చెంగల్‌పట్టులో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న కారుణ్య తన స్నేహితులతో కలిసి కేరళకు వెళ్తోంది. తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి ముందు కారుణ్య తన ప్రియుడు రాజేష్‌తో మాట్లాడుతూవుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. 
 
రైలు కదలడం ప్రారంభించగానే, ఇద్దరూ దానిని ఎక్కేందుకు పరుగెత్తారు, కానీ కారుణ్య కాలుజారిపోయింది. మెట్లపై నుంచి దొర్లిపోయింది. కదులుతున్న రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాజేష్ కూడా రైలు నుంచి కింద పడ్డాడు.
 
తోటి ప్రయాణీకులు వారిని కాపాడారు. రాజేష్‌, కారుణ్యను పట్టాల కిందకు వెళ్లకుండా కాపాడారు.  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments