Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుపాటి జయరాం హత్య కేసులో ట్విస్ట్... తెరపైకి శిఖా ప్రియుడు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:40 IST)
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడు సంతోష్ పేరు తెరపైకి వచ్చింది. ఇపుడు ఈ సంతోష్ ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
జయరామ్ అమెరికా పౌరుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో రోజుకు ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. జయరామ్ హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్ అనే యువకుడితో ఆమె లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో సంతోష్‌ ఎవరనే విషయాన్నికూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే కుత్బుల్లాపూర్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, జయరాం హత్య తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ఓ పోలీసు అధికారులు సలహా ఇచ్చారు. వీరిని ఇప్పటికే విచారించారు. మరోసారి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులను పోలీసులు విచారించనున్నారు. ఇదిలావుంటే జయరామ్‌ హత్యకు నెలరోజుల ముందు చింతల్‌లో రూ.100 కోట్ల విలువైన డాక్యుమెంటేషన్ రాకేష్ రెడ్డిచేయించినట్లు గుర్తించారు. డాక్యుమెంట్‌ తయారీదారుల నుంచి వివరాలు పోలీసులు సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments