Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గుతో తలదించుకుంటున్నా, కరోనా బాధితుడ్ని చెత్త బండిలో తీసుకెళ్లారు: రఘురామక్రిష్ణ రాజు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (22:39 IST)
కరోనా సమయంలో హాట్ టాపిక్‌గా ఉన్న రాజకీయ నేత రఘురామక్రిష్ణరాజు. వైసిపిలో ఉంటూ ఆ పార్టీనే విమర్సిస్తున్న నేత. ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూ తనను విమర్సించే వారిని వదిలిపెట్టకుండా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. ఈ మధ్య ఎక్కువగా బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నా తను మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళనని చెబుతున్నాడు.
 
అయితే తాజాగా రఘురామక్రిష్ణరాజు వ్యవహారశైలి పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. నేను ఏ రాజకీయ పార్టీకో.. నేతకో క్షమాపణలు చెప్పడం లేదు. నా బాధంతా నా సొంతూళ్ళో కరోనా వచ్చిన బాధితుడ్ని చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో ఆసుపత్రికి తీసుకెళ్ళడం. దీనికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నా.
 
వెయ్యికి పైగా ఆంబులెన్సులను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు ఉంటాయన్నారు. అయితే అదంతా ఎక్కడా కనబడటంలేదే. నాకు చాలా బాధేస్తోంది. కనీసం కరోనా టెస్టుల ఫలితాలు కూడా సరైన సమయానికి రావడం లేదు. చాలా ఆలస్యమవుతోంది. ఎప్పటికప్పుడు రావాల్సిన ఫలితాలు ఏడురోజుల తరువాత వస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు రఘురామక్రిష్ణరాజు. ప్రభుత్వం అస్సలు పనిచేస్తుందా లేదా అంటూ ప్రశ్నిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments