Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గగుడిలో 22 నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (08:02 IST)
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ప్రతిఏటా ఆషాడం, శ్రావణ మాసాల్లో వైభవంగా నిర్వహించే శాకాంబరీ, అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ, శ్రావణ మాసోత్సవాలను ఈ ఏడాది కూడా యథావిధిగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చేనెల 22 నుంచి 24 వరకు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. గత నెల రోజులుగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలను సడలించడం, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో ఆషాడ, శ్రావణ మాసోత్సవాలు నిర్వహించే అంశంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ వైదిక కమిటీ సభ్యులు, పరిపాలన, ఇంజనీరింగ్‌, పూజల విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున కొవిడ్‌ నిబంధనలను పక్కా అమలు చేస్తూ, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా కొవిడ్‌ నిబంధనల నడుమ దుర్గగుడిలో శాకాంబరీదేవి ఉత్సవాలు, ఆషాఢ, శ్రావణ మాసోత్సవాలను నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా ఆయా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈవో సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments