Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన శిశువుల్ని కిడ్నాప్ చేసి.. అమ్మేస్తారు.. ముఠా అరెస్ట్

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:25 IST)
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శిశువులను కిడ్నాప్ చేసి.. అక్రమంగా విక్రయించిన నలుగురు మహిళలతో కూడిన ఏడుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను కిడ్నాప్ చేసే ఓ ముఠా.. దేశంలోని పలు ప్రాంతాల వారికి ఆ శిశువులను విక్రయిస్తూ.. బాగా డబ్బు గుంజుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసుల బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చిన్నారుల కిడ్నాప్ ముఠాకు చెందిన గంగాధర రెడ్డి అనే వ్యక్తితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఇటీవల ఒక నెల వయస్సుగల ఓ ఆడ శిశువు, రెండున్నర వయస్సున్న అబ్బాయిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. 
 
హైదరాబాదులో ఈ చిన్నారులను కిడ్నాప్ చేసి.. సంతానం లేని దంపతులకు రూ.2.5లక్షలు, రూ.3.10 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ముఠాకు చెందిన కిడ్నాపర్ల నుంచి ముగ్గురు చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అరెస్టయిన ఏడుగురి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం