Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన శిశువుల్ని కిడ్నాప్ చేసి.. అమ్మేస్తారు.. ముఠా అరెస్ట్

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:25 IST)
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శిశువులను కిడ్నాప్ చేసి.. అక్రమంగా విక్రయించిన నలుగురు మహిళలతో కూడిన ఏడుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను కిడ్నాప్ చేసే ఓ ముఠా.. దేశంలోని పలు ప్రాంతాల వారికి ఆ శిశువులను విక్రయిస్తూ.. బాగా డబ్బు గుంజుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసుల బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చిన్నారుల కిడ్నాప్ ముఠాకు చెందిన గంగాధర రెడ్డి అనే వ్యక్తితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఇటీవల ఒక నెల వయస్సుగల ఓ ఆడ శిశువు, రెండున్నర వయస్సున్న అబ్బాయిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. 
 
హైదరాబాదులో ఈ చిన్నారులను కిడ్నాప్ చేసి.. సంతానం లేని దంపతులకు రూ.2.5లక్షలు, రూ.3.10 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ముఠాకు చెందిన కిడ్నాపర్ల నుంచి ముగ్గురు చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అరెస్టయిన ఏడుగురి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం