Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దెలచెర్వు సూరి హత్య కేసు : పరిటాల రవి ఫ్యామిలీ హస్తం? నేడు తీర్పు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:18 IST)
అనంతపురం జిల్లాకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది. ఈ హత్య కేసులో టీడీపీ నేత దివంగత పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని హతుని భార్య గంగుల భానుమతి ఆరోపిస్తూవస్తోంది. ఈ క్రమంలో సూరి హత్య కేసులో తుది తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. 
 
కాగా, 2011, జనవరి 3వ తేదీన సూరి, అతడి ప్రధాన అనుచరుడు, అల్లుడుగా భావిస్తూ వచ్చిన భానుకిరణ్, డ్రైవర్ మధులు జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వైపు కారులో వెళుతున్నారు. అపుడు కొందరు పాయింట్ బ్లాంక్‌లో సూరిపై కాల్పులు జరిపి హతమార్చారు. 
 
ఈ కేసులో భూనుకిరణ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. అలాగే, డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు విచారణ సాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పలువురు వాంగ్మూలంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఈ కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments