Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దెలచెర్వు సూరి హత్య కేసు : పరిటాల రవి ఫ్యామిలీ హస్తం? నేడు తీర్పు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:18 IST)
అనంతపురం జిల్లాకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది. ఈ హత్య కేసులో టీడీపీ నేత దివంగత పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని హతుని భార్య గంగుల భానుమతి ఆరోపిస్తూవస్తోంది. ఈ క్రమంలో సూరి హత్య కేసులో తుది తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. 
 
కాగా, 2011, జనవరి 3వ తేదీన సూరి, అతడి ప్రధాన అనుచరుడు, అల్లుడుగా భావిస్తూ వచ్చిన భానుకిరణ్, డ్రైవర్ మధులు జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వైపు కారులో వెళుతున్నారు. అపుడు కొందరు పాయింట్ బ్లాంక్‌లో సూరిపై కాల్పులు జరిపి హతమార్చారు. 
 
ఈ కేసులో భూనుకిరణ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. అలాగే, డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు విచారణ సాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పలువురు వాంగ్మూలంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఈ కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments