Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు పట్టిన గతే మమతకు పడుతుంది... కృష్ణం రాజు

Webdunia
సోమవారం, 29 జులై 2019 (20:37 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత, యు.వి కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని మండిపడ్డారు కృష్ణం రాజు.

పశ్చిమ గోదావరి పర్యటనకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు నాలుగేళ్లు మోదీ నుంచి లబ్ది పొంది, అబద్దాలు తప్పుడు ప్రచారం చేసినందుకే నేడు చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు.
 
దేశ వ్యాప్తంగా మోదీ హవా నడుస్తోందన్నారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని 2024లో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ  అధికారం చేపడుతుందని కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా పడుతుందని వ్యాఖ్యానించారు.
 
అబద్దాలు, మోసాలతో ఎక్కువ కాలం గడపలేమని, నిజాయితీ ఉన్నప్పడే ప్రజల గుండెలు గెలుస్తామన్నారు కృష్ణంరాజు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనుల సాధన కోసం ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments