Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష సర్పంతో సెల్ఫీ.. పామును మెడలో వేసుకుని ఫోజిచ్చాడు.. అంతే కాటేసింది..

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (11:39 IST)
స్మార్ట్‌ఫోన్ లేనిదే పొద్దు గడపని వారి సంఖ్య పెరిగిపోతుంది. 20వ శతాబ్ధంలో అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. స్మార్ట్‌ఫోన్లు చేతిలో పెట్టుకుని సెల్ఫీల పిచ్చిలో చాలామంది యువత ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీల కోసం యువత సాహసాలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ కోసం పాకులాడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
సూలూరు పేటకు చెందిన జగదీష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి.. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం సూళూరుపేట గ్రామం లో ఓ పాములోడు విష సర్పాలతో రోడ్డుపై ఆడిస్తుండగా.. జగదీష్ పాములతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబాకాడు. అంతేగాకుండా పామును మెడలో వేసుకున్నాడు. కానీ ఆ సర్పం జగదీష్‌ను కాటేసింది. 
 
వెంటనే స్థానికులు జగదీష్‌ను ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. పాము విషం శరీరంలోకి వేగంగా పాకడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు పాము పళ్లు పీకకుండా రోడ్డుపైకి పాములను తెచ్చిన పాములడు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments