Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. 5 నిమిషాలకే 'ధడేల్'మంటూ సౌండ్... బోటు బోల్తా(Video)

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:37 IST)
పాపికొండలు...ఎవరైనా సరే ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటారు. ఎందుకంటే అద్భుతమైన ప్రాంతం. చుట్టూ కొండలు. మధ్యలో బోటు షికారు. ఇలా ఉంటే ఎవరైనా సరే వెళ్ళకమానరు. అయితే ఆ బోటు షికార్ కాస్త 60కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 
 
తెలంగాణా, ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు చెందిన 73మంది బోటులో ప్రయాణీస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో బోటు అలలకు కొట్టుకుని బోల్తా పడింది. 26మంది సురక్షితంగా బయటపడ్డారు. 8మంది చనిపోయారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రమాదానికి 5 నిమిషాలు ముందు... 
 
అయితే బోటు బోల్తా పడక ముందు సరిగ్గా 5నిమిషాల ముందు ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వీడియో తీసుకున్న తరువాత బోటు బోల్తా పడింది. ఆ సెల్ ఫోన్ ను ఎన్డీఆర్ ఎఫ్‌ బృందాలు బయటకు తీశారు. సెల్ ఫోన్ మునిగిపోయింది కానీ అందులో ఉన్న మెమొరీ మాత్రం అలాగే ఉంది. దీంతో చివరి నిమిషంలో రికార్డ్ అయిన వీడియో చూస్తే అందరినీ బాధిస్తుంది.
 
బోటులో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ 73మంది ప్రయాణీస్తున్నారు. 5మంది గజ ఈతగాళ్ళు కూడా అందులో ఉన్నారు. వాళ్ళు కూడా అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశారు. కానీ విధి వైపరీత్యం చివరకు ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments