Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక: మంత్రి బొత్స

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (21:55 IST)
జూలై 8 వ తేదీన పంపిణీ చేయదలచిన ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా సన్నద్దం కావాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.

ఇళ్ల పట్టణాలు, ఇళ్లు కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ టిడ్కో అధికారులకు ఆయన స్పష్టం చేశారు. 

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై  పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, స్పెషల్ సెక్రటరీ రామ మనోహర్, టిడ్కో ఎండి శ్రీధర్ తదితర ఉన్నతాధికారులతో కలిసి గురువారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన కమిషనర్లతో మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో పట్టాల పంపిణీ కోసం అవసరమైన  స్థల లభ్యత, లబ్ధిదారుల సంఖ్య తదితర అంశాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఎంపిక పూర్తి అయిన లబ్ధిదారులకు, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాల పై తీసుకుంటున్న చర్యలను కూడా తెలుసుకున్నారు.

అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉన్న ఇళ్ల నిర్మాణపు పనులకు సంబంధించిన వివరాలను కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పట్టణప్రాంతాల్లోని అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి సమకూర్చడంలో అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్భోదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments