Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో 1.35 కేజీల బంగారం పట్టివేత

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:12 IST)
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 1.35 కేజీల బంగారాన్ని శ్రీకాకుళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన కె.సంతోష్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో 1,351 గ్రాముల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో కలిసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంతోష్‌ కుమార్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడ్ని ప్రశ్నించామని.. ఈ క్రమంలో సంతోష్‌ వద్ద ఉన్న బ్యాగులో 1,351 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు చెప్పారు.

పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రసీదు లేని బంగారంగా సంతోష్‌ తెలిపాడన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఓ బంగారు ఆభరణాల దుకాణదారుడు ఆర్డర్‌ ఇవ్వగా తాను తీసుకొచ్చినట్లు అంగీకరించాడని సీఐ వివరించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.65లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు.

సంతోష్‌ కుమార్‌ పర్లాకిమిడిలో ఓ బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేస్తామని సీఐ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments