Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఫ్యామిలీకి సెక్యూరిటీ తొలగింపు... ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (12:32 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబానికి కల్పిస్తూ వచ్చిన భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ముఖ్యంగా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిలకు ఇప్పటివరకు ఉన్న భద్రతను తొలగించింది. 
 
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి, వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే చంద్రబాబుకు కల్పిస్తూ వచ్చిన భద్రతను కుదించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారా లోకేశ్‌కు కూడా కల్పిస్తూ వచ్చిన భద్రతను కూడా తగ్గించింది. 
 
ప్రస్తుతం నారా లోకేశ్‌కు 5 ప్లస్ 5 గన్‌మెన్ల భద్రత ఉండగా, దాన్ని 2 ప్లస్ 2కు కుదించింది. అలాగే, నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరిలకు కల్పిస్తూ వచ్చిన భద్రతను పూర్తిగా తొలగించింది. ఈ భద్రత తొలగింపుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు. 
 
గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో వైకాపా నేతల భద్రత పట్ల ఏమాత్రం పక్షపాతం చూపలేదనీ, జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు సైతం పూర్తి భద్రతను తల్పించామని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ, నవ్యాంధ్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్... చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులకు భద్రతను కుదిరించి రాజకీయకక్ష సాధింపునకు దిగిందని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments