Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన తిరుపతి వందే భారత్ సీట్లు.. తగ్గిన ప్రయాణ సమయం

Webdunia
గురువారం, 18 మే 2023 (10:43 IST)
సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తుంది. దీంతో ఈ రైలు ప్రారంభించిన అనతికాలంలోనే బోగీలను పెంచారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు బోగీల సంఖ్యను రెంట్టింపు చేసినట్టు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు వెల్లడించారు. అదేసమయంలో టైమింగ్‌లో కూడా స్పల్ప మార్పులు  చేశారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 బోగీలోతో ఈ రైలును నడుపుతున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ఒక్క మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు పరుగులు తీస్తుంది. అదేసమయంలో ఈ రైలు ప్రయాణ వేళల్లో కూడా స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 
 
ప్రతి రోజూ ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ రైలు నల్గొండకు ఉదయం7.29 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత గుంటూరుకు ఉదయం 9.35 గంటలకు, గుంటూరుకు మధ్యాహ్నం 11.15 గంటలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుపతికి 14.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు ప్రయాణ సమయం 8.15 గంటలు పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments