Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ సూత్రధారి అరెస్టు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (12:50 IST)
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీరులు (అగ్నిపథ్)కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాకాండ చోటుచేసుకుంది. ఈ హింసాకాండకు సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇపుడు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. 
 
ఏపీలోని నర్సారావు పేటలో సాయి డిఫెన్స్ అకాడెమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన మాజీ సైనికోద్యోగి కావడం గమనార్హం. పైగా, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాకాండకు పథక రచన చేసింది ఏపీలోనని తేలిపోయింది. 
 
మరోవైపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments