Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు.. పారదర్శకంగా జరగాలి: ఎస్ఈసీ

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (11:38 IST)
రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోందని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతిఒక్కరూ మందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. 
 
విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్న నిమ్మగడ్డ.. స్వీయనియంత్రణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదని... పారదర్శకంగా జరగాలని అభిప్రాయపడ్డారు
 
అలాగే, విశాఖ జిల్లా వ్యాప్తంగా 20,118 పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి డివిజన్‌లో రెండు దశల్లో శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరం. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. 
 
రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాలి. మేం స్వీయ నియంత్రణకు కట్టుబడి ఉన్నాం. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు.. అవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి’ అని నిమ్మగడ్డ కోరారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments