Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ప్రశాంతంగా శ్రీవారి సేవలో నిమ్మగడ్డ, కానీ పార్టీలకు గుబులెత్తిస్తున్నారు

తిరుమలలో ప్రశాంతంగా శ్రీవారి సేవలో నిమ్మగడ్డ  కానీ పార్టీలకు గుబులెత్తిస్తున్నారు
Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (22:21 IST)
రాష్ట్రరాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కన్నా ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశమే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఎంతో పాటు మంత్రులకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
 
అధికారం వైసిపిదే అయినా ఒకే ఒక్క పదవితో నిమ్మగడ్డ గందరగోళానికి తెరలేపుతున్నారు. పంచాయతీ ఎన్నికలు వద్దని ప్రభుత్వం భావిస్తే చివరకు పంచాయతీ ఎన్నికలను జరిపించేస్తున్నారు. ఇక మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అది కూడా మరో రెండు రోజుల్లో పూర్తి కాబోతోంది.
 
మూడవ విడత తరువాత ఇక నాలుగవ విడత 21వ తేదీ పూర్తి కాబోతోంది. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి పురపాలక, నగర పాలకసంస్ధ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు ఎస్ఈసి. ఈ షెడ్యూల్ ప్రకారం గతంలో ఏవిధంగా అయితే ఎన్నికల ప్రక్రియ జరుగుతూ వచ్చిందో.. ఇప్పటి ఎన్నికల్లో కూడా అదే కొనసాగాలన్నారు.
 
దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. గత మూడురోజుల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుపతిలోనే ఉంటున్నారు. ఇక్కడి నుంచే తన నిర్ణయాలు మొత్తాన్ని తీసేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పార్టీ నేతల్లో ఒకింత హైరానా నెలకొంది. 
 
ఒకవైపు సంచలన నిర్ణయాలు, మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్సిస్తూ ప్రశాంతంగా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిన్న ఉదయం, ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్సించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వామివారి సేవలో ఎస్ఈసి పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments