Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ నిమ్మగడ్డ సీరియస్, బలవంతపు ఏకగ్రీవాలపై కలెక్టర్లకు ఆదేశాలు, ఏం జరుగుతుందో?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:22 IST)
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌ అయ్యింది. అభ్యర్థి మినహా ఇతరులు ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని స్పష్టం చేసింది. అది ఉపసంహరణగా పరిగణించకూడదని తెలిపింది.

బలవంతపు ఉపసంహరణలపై పత్రికల్లో కథనాలు, ప్రసారాలు వచ్చాయని... దీన్ని కమిషన్‌ సీరియస్‌గా తీసుకుందని తెలియజేసింది.

తిరుపతి ఏడో వార్డులో నామినేషన్‌ ఉపసంహరణపై ఫోర్జరీ సంతకం చేసి ఉపసంహరణ చేసుకున్నారని వార్తలు వచ్చాయని, దీనిపై వెంటనే అభ్యర్థి ఆర్‌వో‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది.

పోలీసులు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీనిని ఎన్నికల నేరంగా పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటామని, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని కోరింది. జాయింట్‌ సెక్రటరీ ఫిర్యాదులను తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఈసీ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments