Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. కత్తెర పెట్టి కుట్టేశారు..

కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (15:04 IST)
కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు గ్రామీణ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన చలపతి(50) ఈ నెల 2వ తేదీన కడుపునొప్పి భరించలేక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించారు. 
 
వైద్యులు రోగికి శస్త్రచికిత్స చేసి ఇంటికి పంపారు. డిశ్చార్జ్‌ అయినా.. అతనికి కడుపులో ఏమాత్రం నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 27న అదే ఆసుపత్రికి వచ్చి బాధితుడు పరిస్థితి వివరించాడు. ఆపై ఆ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో అతని పొట్టలో కత్తెర వున్న విషయాన్ని గుర్తించారు. 
 
ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చేయాలనుకున్న ఆస్పత్రి యాజమాన్యానికి ఏమాత్రం వీలుపడలేదు. చివరికి ఈ నెల 28న మళ్ళీ ఆ వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments