Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 16 నుంచి తెరుచుకోనున్న స్కూల్స్!

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ తెరవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
గురువారం జగనన్న విద్యాదీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బడులు తెరుచుకున్న రోజునే జగనన్న విద్యాకానుకను పంపిణీ చేస్తామన్నారు. 
 
విద్యాకానుకలో ఈసారి డిక్షనరీని కూడా చేర్చినట్టు తెలిపారు. అలాగే, నాడు-నేడులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేసిన 15 వేల బడులను ప్రజలకు అంకితం చేయనున్నట్టు తెలిపారు. అదే రోజున రెండో విడత నాడు-నేడుకు శ్రీకారం చుడతామని మంత్రి వివరించారు.
 
ఇదిలావుంటే దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీనికి రాష్ట్రంలో నమోదతువున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగదలే కారణంగా చెప్పుకోవచ్చు. కేరళ వంటి రాష్ట్రాల్లో రెండు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్ కూడా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments