కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అడ్మిషన్ల షెడ్యూల్ విడుద‌ల

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:47 IST)
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తుర్భా గాంధీ  బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీలు) 2020 -21 విద్యా సంవత్సరానికిగాను, 6వ తరగతిలో ప్రవేశం, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు  స్వీకరించ‌డం ఆగస్టు 25తో ముగిసింది.

ఎంపిక చేయబడిన విద్యార్ధినులు ఆగస్టు 31నుండి సెప్టెంబరు 4వరకు, వారి మొబైల్ నెంబర్‌కు పంపబడిన సమాచారం ప్రకారం సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాల‌ని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు.

మొబైల్ ఫోన్  ద్వారా సమాచారం అందించబడిన విద్యార్థినులు తమతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం వివరాల‌ను తీసుకురావాల్సి ఉంటుంద‌న్నారు.

ఎంపిక చేయబడిన విద్యార్థినుల వివరాల‌ను వెబ్‌సైట్ నందు మరియు  పాఠశాల నోటీసు బోర్డు నందు ప్రదర్శించబడతాయ‌ని పేర్కొన్నారు. ఇత‌ర వివ‌రాల‌కు 9441270099, 9494383617నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments