Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీఎస్టీ వేధింపుల కేసు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:58 IST)
టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన అనేక చార్జీలను ఎత్తి చూపుతూ, "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించింది. 
 
ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ ఏపీలోని వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తమ గ్రామంలో తమ పార్టీ అధినేతను టీడీపీ నేతలు విమర్శించడాన్ని సహించలేని వైకాపా నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనిపై గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు చింతమనేని ప్రభాకర్‍‌పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైకాపా నేతలపై ఫిర్యాదులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై సర్పంచ్ భూపతి, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, మరో ఐదుగురు దాడి చేశారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేత రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో వైకాపా నేతలపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments