Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీఎస్టీ వేధింపుల కేసు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:58 IST)
టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన అనేక చార్జీలను ఎత్తి చూపుతూ, "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించింది. 
 
ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ ఏపీలోని వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తమ గ్రామంలో తమ పార్టీ అధినేతను టీడీపీ నేతలు విమర్శించడాన్ని సహించలేని వైకాపా నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనిపై గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు చింతమనేని ప్రభాకర్‍‌పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైకాపా నేతలపై ఫిర్యాదులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై సర్పంచ్ భూపతి, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, మరో ఐదుగురు దాడి చేశారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేత రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో వైకాపా నేతలపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments