Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ప్రాణాలను కాపాడండి: గుంటూరులో గర్భిణీ స్త్రీల ఆవేదన

Webdunia
బుధవారం, 19 మే 2021 (16:37 IST)
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లోని గైనిక్ వార్డులో ప్రసవానికి వచ్చిన గర్భిణీ స్త్రీలు నరకాన్ని చూస్తున్నారు. ప్రసవానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేస్తామని చెప్పి దుస్తులు వేసి నిన్న మధ్యాహ్నం నుంచి ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టి ఇప్పటివరకు పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి.

రక్తం ఎక్కించాలి అని చెప్పి రక్తం తెప్పించి రెండు రోజులు గడుస్తున్నా ఎటువంటి వైద్యం అందించగా పోవడంతో రక్తం కూడా పాడైపోయింది. వార్డులో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ గర్భిణులను పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని భయంతో అటు గర్భిణీ స్త్రీలు ఇటు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికి చెప్పాలో తెలియక వారిలో వారు మథనపడుతూ ఆసుపత్రి వైద్యుల ధోరణి కి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు తమ దీనస్థితిని వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments