Webdunia - Bharat's app for daily news and videos

Install App

సండ్రకు మినిస్టర్ బెర్త్ ఖరారు... టీడీపీకి గుడ్‌బై?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో బెర్తు ఖరారుకావడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఈనెల 19వ తేదీలోపు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఈనెల 19వ తేదీన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. 
 
నిజానికి టీటీడీ పాలకమండలి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నియామకం రద్దయ్యింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితుడైన సండ్ర వెంకటవీరయ్య... నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే నెల రోజులు దాటినా... ఆయన బాధ్యతలు తీసుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య... అధికార టీఆర్ఎస్‌లోకి వెళతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సండ్ర స్పందించిక పోయినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం సండ్ర టీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments