Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాంబాబు... మైనింగ్ రాయుడు : షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:01 IST)
ఏపీలోని అధికార వైకాపా అధికార పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే సంచలన ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ వారు ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. ఇది సంచలనంగా మారింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ రాజుపాలెం వైసీపీ కార్యకర్తలు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కోట నెమిలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిల్‌లో ఆరోపించారు. 
 
ఈ విషయంపై సీఎం జగన్‌, జిల్లా కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే స్థానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్‌లో వీరు పేర్కొన్నారు.
 
ఈ పిటిషన్‌ను వైకాపా కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది నాగరఘు దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు... అధికారిక పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తే... అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments