Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక కొరతతో రోడ్డుపడిన భవన నిర్మాణ కార్మికులు

Webdunia
గురువారం, 18 జులై 2019 (13:00 IST)
ఇసుక కొరతను పరిష్కారం చేసి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యం.మహేష్ డిమాండ్ చేశారు. ఆయన కొండపల్లి స్టేషన్ సెంటర్లో భవన నిర్మాణ తాఫీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నా ఇసుక క్వారీలను వెంటనే ఓఫెన్ చేసి ఇసుక కోరత లేకుండా చూడాలని, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యం.మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
ఇబ్రహింపట్నంలో మండలం ఉన్నా పెర్రీ, గుంటుపల్లి, సూరయపాలెం ఇసుక రీచ్‌లను అందుబాటులో తీసుకురావలని, ఇసుక ఆక్రమ వ్యాపారంని అరికట్టాలని, ఇసుక సామన్యులకు అందుబాటులోకి తీసుకురావలని కోరారు. ఇప్పటికే పనులు లేక భవన నిర్మాణ కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ముఖ్యమంత్రి నూతన ఇసుక పాలసీని సెఫ్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తుందని చేప్పుతున్నారని, అప్పటివరకు భవన నిర్మాణ కార్మికులు పని లేకపోతే జీవన ఏవిధంగా సాగుతోందో చెప్పాలని ప్రభుత్వాన్ని మహేష్ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం పని కల్పించాలని, వారి కష్టాలను తీర్చాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments