Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నుంచి టీటీడీ అగరబత్తుల అమ్మకం

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:31 IST)
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగరబత్తులను ఆగస్టు 15 నుంచి అమ్మకాలు ప్రారంభించాలని ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ టీటీడీ నుంచి ముడిసరుకు, తయారీ ఖర్చు మాత్రం తీసుకుని అగరబత్తులను తయారు చేసిస్తుందన్నారు. వీటికి ధర నిర్ణయించి మొదట తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించాలన్నారు.

ఆ తర్వాత మరిన్ని చోట్లకు విస్తరించాలన్నారు. పంచగవ్యతో తయారు చేస్తున్న 15 రకాల ఉత్పత్తులపై ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలో విడుదల చేయాలన్నారు.

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఆధునికీకరించేందుకు అవసరమైన యంత్రాల టెండర్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.   

ఇప్పటి వరకు 115 ఉత్పత్తులకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు ఉన్నాయని, మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్సు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments