Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత : సర్కారు ఆదేశాలు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించలేమని సర్కారు చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
దేశంలో లాక్‌‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. 
 
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తోంది. ఇప్పటికే మార్చి నెల వేతనాల్లో కోత విధించింది. అలాగే, ఏప్రిల్ నెల వేతనాల్లో కూడా కోత విధించనున్నట్టు పేర్కొంది. 
 
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే రిటైర్డ్‌ ఉద్యోగులకు మాత్రం పూర్తి పింఛన్లు అందిస్తామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments