Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రోజునా పస్తులేనా? ఉద్యోగులకు పడని వేతనాలు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (22:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఠంచనుగా నెలలో ఆఖరు తేదీన వేతనాలు జమ అయ్యేవి. కానీ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెలాఖరులో వేతనాలు జమ చేసిన సందర్భాలు చాలా చాలా అరుదు. ఈ నెల కూడా అదే విధంగా జరిగింది. 
 
శనివారం తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ. దీంతో ఈ నెలలో అయినా సకాలంలో జీవితాలు పడతాయని ఉద్యోగులంతా ఎదురు చూశారు. కానీ, ఏప్రిల్ ఒకటో తేదీ అయిన శుక్రవారం ఏ ఒక్క ఉద్యోగికి కూడా వేతనం జమకాలేదు. ఇందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం కాదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. 
 
కొత్తగా తలెత్తిన సమస్య కారణంగా ఈ నెల 6, 7వ తేదీల్లోగానీ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే... గత తెదేపా ప్రభుత్వ హయాంలో సీఎఫ్ఎంఎస్ పేరిట కొత్త తీసుకొచ్చిన విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తూ వ్చారు. అయితే ఇపుడు వైకాపా ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌‍ను మార్చేసి, తెదేపా ప్రభుత్వం కంటే ముందున్న హెచ్ఆర్ఎంఎస్ విధానం ద్వారానే వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం పేరోల్ పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్ను తీసుకొచ్చింది. ఈసాఫ్ట్‌వేర్ ఇంకా ఆర్బీఐతో అనుసంధానం కాలేదు. అంతేకాకుండా పాత విధానంలో బిల్లు అప్‌లోడ్ ఇంకా పూర్తికాలేదు. హెచ్ఆర్ఎంఎస్ విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా కొనసాగుతోంది. అది పూర్తయ్యేందుకు కనీసం ఈ నెల 5వ తేదీ వరకు సమయం పట్టేలా ఉంది. ఈ లెక్కల ఈ నెల 6 లేదా 7 తేదీల్లో ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments