Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (11:44 IST)
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలకు పాల్పడినట్టు ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నెలో సజ్జల కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడినట్టు తేలింది. మొత్తం 63.72 ఎకరాల కబ్జా చేసినట్టు విచారణ కమిటి నిర్ధారించింది. ఆక్రమించుకున్న భూముల్లో 52.40 ఎకరాల అటవీ భూమి, పాయవంక రిజర్వాయర్ భూమి ఉన్నాయని, ఆక్రమి భూముల్లో పక్కా నిర్మాణాలు, ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకున్నారని, భూమి స్వాధీనానికి, కఠిన చర్యలు తీసుకునేలా కమిటి సిఫారసు చేసింది. 
 
సజ్జల కుటుంబం ఆక్రమించుకున్న భూమిలో సింహభాగం అటవీ శాఖకే చెందినదిగా గుర్తించింది. సీకే దిన్నె గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1629లో ఏకంగా 52.40 ఎకరాల అటవీ భూమిని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమించుకున్నట్టు గుర్తించింది. దీంతో పాటు గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా ఈ ఆక్రమణలో ఉన్నట్టు తేలింది. ఈ భూములు చుట్టూ కంచె వేయడమే కాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఒక అతిథి గృహం, నాలుగు గదులు నిర్మించారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments