Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతుల్లో తెలుగు వాసి... సాయితేజ స్వగ్రామం రేగడలో విషాదం..

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:00 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులికా రావత్‌ సహా 13 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలోనే సాయితేజ కూడా మృత్యువాతపడ్డారు. 
 
ఈయన సొంతూరు జిల్లాలోని కురబలకోటం మండలం, రేగడ గ్రామం. 2013లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్‌ స్థాయికి ఎదిగిన సాయితేజ... ప్రస్తుతం బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
 
ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. రేగడ గ్రామ ప్రజలు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. గత సెప్టెంబరు నెలలో వినాయకచవితి పండుగ కోసం సాయితేజ చివరిసారి తన స్వగ్రామానికి వచ్చారు. ఇపుడు శాశ్వత లోకాలకు చేరుకున్నారు. ఈయన పార్థివదేహం గురువారం సొంతూరుకు తరలించే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments