Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకు 3 వేలు, ఇదే నా అడ్రస్ అంటూ భార్య ఫోన్ నుంచి శాడిస్ట్ భర్త వాట్సప్ మెసేజ్

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (18:52 IST)
ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. పెళ్ళయి నాలుగు నెలలే అవుతోంది. అయితే కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. అతను టిటిడి ఉద్యోగి. బాగా సంపాదిస్తున్నాడు. అయినా డబ్బు డబ్బు.. ఇదే పిచ్చి. దీంతో కట్టుకున్న భార్యను కార్ల్ గర్ల్‌గా మార్చేందుకు సిద్థమయ్యాడు. ఏకంగా తన భార్య గంటకు 3 వేలు అంటూ బేరం పెట్టాడు.
 
తిరుపతి రూరల్ తిమ్మిడినాయుడు పాళెం ప్రాంతం. రేవంత్, నిరోషాలకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. టిటిడిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో 10 లక్షల నగదు, 10 లక్షల రూపాయల విలువ చేసే నగలును ఇచ్చారు. అయితే ఇంత ఇచ్చినా డబ్బు పిచ్చి మాత్రం అతనికి తగ్గలేదు.
 
పెళ్ళయిన నెల నుంచి కూడా అదనపు కట్నం తీసుకురమ్మంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో నిరోషా ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళింది. ఆ తరువాత నిరోషా కుటుంబ సభ్యులు సర్దిచెప్పి మళ్ళీ పంపించారు. కానీ గత రెండురోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఇదే విషయంపై గొడవ జరిగింది.
 
దీంతో భర్త తన భార్య ఫోన్ తీసుకుని అందులో నుంచి గంటకు 3 వేలు, ఇదే నా అడ్రస్ అంటూ కాల్ గర్ల్ అంటూ మెసేజ్‌లు పంపాడు. దీంతో వాట్సాప్ గ్రూపులోని చాలామంది ఫోన్లు చేయడం ప్రారంభించారు. కొంతమంది ఏకంగా ఇంటికే వచ్చేశారు. దీంతో షాక్ తిన్న నిరోషా అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయింది. వాట్సాప్ మెసేజ్ చూసి నివ్వెరపోయింది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments