Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా జగనన్న అని గెలిపించుకున్న పాపానికి.. బాగా బుద్ధి వచ్చింది...

Webdunia
బుధవారం, 12 మే 2021 (09:48 IST)
మా జగనన్న.. మా ప్రభుత్వం అని గెలిపించుకున్న పాపానికి బాగా బుద్ధివచ్చేలా చేస్తున్నారని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఓ మృతుని కుమారుడు గిరిధర్ రావు వాపోతున్నాడు. ఈయన ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఈయన తండ్రి రుయా అస్పత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. 
 
ఈ ఘటనపై గిరిధర్ రావు మాట్లాడుతూ, ఇటీవల మానాన్న పీఎస్‌ రామారావుకు కరోనా వచ్చి.. పూర్తిగా నయమైంది. మళ్లీ సోమవారం ఊపిరాడడం లేదని చెప్పడంతో రుయాస్పత్రికి తీసుకొచ్చాం. సాయంత్రం వరకు అరకొరగా వైద్యం అందించారు. సాయంత్రం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందనడంతో ఎమర్జెన్సీ వార్డుకు మార్చి ఆక్సిజన్‌ పెట్టారు. అలా పెట్టిన అరగంటకే ఆక్సిజన్‌ సరఫరా ఆగింది. 
 
ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని సిబ్బంది హడావుడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కొంత సమయానికే ఆక్సిజన్‌ అందక మా నాన్న మృతిచెందాడు. మా జగనన్న, మా ప్రభుత్వం అని గెలిపించుకున్న పాపానికి మాకు బాగా బుద్ధి వచ్చింది. నా కళ్ల ముందే మా నాన్నతోపాటు మరో 20 మంది వరకు చనిపోయారు. 
 
ఆక్సిజన్‌ అందక అరగంటకు పైగా గిలగిల కొట్టుకుంటున్నా ఒక్కరూ స్పందించలేదు. ఆక్సిజన్‌ అయిపోతుందని ముందే తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ విషయాన్ని ముందుగా చెప్పుంటే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకొనే వాళ్లం అంటూ బోరున రోధిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments