Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఆర్టీసీ ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:33 IST)
తిరుపతిలో ఆర్టీసీ ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌కు మార్గం సుగమం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలను ఇంటిగ్రేటెడ్‌ (అన్ని హంగులతో కూడిన) బస్‌స్టేషన్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తొలిదశ నిర్మాణానికి తిరుపతి ఆర్టీసీ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) తయారీ బాధ్యతలను ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబరులో తిరుపతి ఆర్టీసీ బస్టాండు కమిటీ పర్యటించి నివేదికను తయారుచేసింది.

ఈ కమిటీ రావడంతో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం 13ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

ఈ స్థలంలోనే బహుళ అంతస్తులతో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణాన్ని తలపెట్టనున్నారు. ఇందులో వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు, ఇతరత్రా కార్యాలయాలు నిర్మించుకునే అవకాశం ఉంది.

టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు వీటన్నింటినీ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే కాంట్రాక్టు సంస్థకు 60 ఏళ్లపాటు బస్టాండు స్థలాలను లీజుకిచ్చే దిశగా ప్రజా రవాణాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments