Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై శివారులో పూర్తిగా దగ్ధమైన ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:52 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ వద్ద గురువారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నుంచి ఆత్మకూరుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెన్నై మాధవరం బస్టాండు నుంచి గురువారం బయలుదేరింది. బస్సులో 47 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. ఈ బస్సు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌హిల్స్ వద్ద వెళుతుండగా, బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులను కిందకు దించేశాడు. 
 
ఇంజిన్ నుంచి మటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments