Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి:కెవిపిఎస్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి జీవనభృతి కోసం 7500 రూపాయలు ఇవ్వాలని కేరళ తరహా 17 నిత్యవసర వస్తువులను ఉచితంగా పేదలకు పంపిణీ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం రవి డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు రాజధాని గ్రామమైన వెంకటపాలెం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహల ఎదుట కెవిపిఎస్ రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం నుద్దేశించి రవి మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యం గోధుమలు తదితర  నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. రాజధానిలో కూలీలు పేదలకు ఉపాధి చూపించాలని అన్నారు.

అసైన్డ్  భూమి సాగుదారులు అయిన పేదలకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని కోరారు మద్యం వలన పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని తక్షణం మధ్యాన్ని నిలిపివేయాలని రవి డిమాండ్ చేశారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా వెంకటపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాజధాని డివిజన్ నాయకులు జి. కృష్ణ, కె ఆంజనేయులు ఎం. నాగరాజు,  కృష్ణారావు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments