Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి:కెవిపిఎస్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి జీవనభృతి కోసం 7500 రూపాయలు ఇవ్వాలని కేరళ తరహా 17 నిత్యవసర వస్తువులను ఉచితంగా పేదలకు పంపిణీ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం రవి డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు రాజధాని గ్రామమైన వెంకటపాలెం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహల ఎదుట కెవిపిఎస్ రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం నుద్దేశించి రవి మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యం గోధుమలు తదితర  నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. రాజధానిలో కూలీలు పేదలకు ఉపాధి చూపించాలని అన్నారు.

అసైన్డ్  భూమి సాగుదారులు అయిన పేదలకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని కోరారు మద్యం వలన పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని తక్షణం మధ్యాన్ని నిలిపివేయాలని రవి డిమాండ్ చేశారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా వెంకటపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాజధాని డివిజన్ నాయకులు జి. కృష్ణ, కె ఆంజనేయులు ఎం. నాగరాజు,  కృష్ణారావు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments