Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుపై ఆర్ఆర్ఆర్ ఫైర్.. సాక్షుల్ని కాపాడండి..

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:42 IST)
ఏపీ సర్కారుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డదారుల్లో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల లిక్కర్ బాండ్స్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. 
 
మార్జిన్ పేరుతో బెవరేజ్‌ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని చూపించారన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, లిక్కరుపై ఎలాంటి ఆదాయం వచ్చినా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు. ఈ ఆదాయంపై బ్యాంకుల వద్ద ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు చెప్పారు.  
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై రఘురామ స్పందించారు. సాక్షి గంగాధర్ రెడ్డి మరణంపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఇప్పటివరకూ ముగ్గురు సాక్షులు చనిపోయారని.. ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 
 
జూలై 4న ప్రధాని మోదీ పర్యటన ఉందని, ఆ సందర్భంగా తన నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు రఘురామ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments