Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో సంసారం, మోజు తీర్చుకుని ఇండియాకి రాగానే ఆమె ఎవరో తెలియదంటున్నాడు?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (22:22 IST)
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం గ్రామానికి చెందిన ఆవులమంద శేఖర్ సౌదీలో ఉండేవాడు. అదే ప్రాంతం సమీపంలోని చెన్నూరుకు చెందిన నాగమణి కూడా సౌదీలో పనిచేస్తూ ఉండేది. ఒక ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని పెళ్ళికి ముందే ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. 
 
ఆ తర్వాత కొద్దిరోజుల్లో నాగమణి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఏదో తూతూమంత్రంగా పెళ్ళి చేసుకున్నాడు శేఖర్. ఇద్దరూ కలిసి కాపురం పెట్టారు. వారికి ఐదేళ్ళ కుమార్తె కూడా ఉంది. అయితే లాక్‌డౌన్ కావడంతో స్వస్థలాలకు చేరుకునే క్రమంలో ఇద్దరూ ఇండియాకు వచ్చేశారు.
 
ఇక్కడకు వచ్చిన వెంటనే ప్లేటు ఫిరాయించాడు శేఖర్. నాగమణి ఎవరో తనకు తెలియదంటూ బుకాయించాడు. పెళ్ళి చేసుకుని ఇప్పుడు తానెవరో తెలియదని చెప్పడంతో నాగమణి కుంగిపోయింది. పెద్దలతో పంచాయతీ పెట్టించింది. అసలు ఐదేళ్ళ కుమార్తె తన బిడ్డే కాదంటున్నాడు శేఖర్.
 
దీంతో పంచాయతీ పెద్దలు ఎలాగోలా సర్దిచెప్పారు. కానీ తనకు 5 లక్షల కట్నం కావాలంటూ ఇప్పుడు రివర్స్ అయ్యాడు శేఖర్. తన దగ్గర అంత డబ్బు లేదని పంచాయతీ పెద్దల ముందే నాగమణి చెప్పడంతో శేఖర్ పంచాయతీ ముగియక ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బిడ్డతో పాటు భర్త ఇంటి దగ్గరకు వెళితే తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో న్యాయం కావాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments