Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంటల్ ఎవరికో జనానికి తెలుసు: రోజా ఫైర్

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (15:54 IST)
ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఫైరయ్యారు. ఎపిఐఐసి కార్యాలయం వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్సలు  చేశారు. కరోనా సమయంలో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
రాష్ట్రంలోని యువత మొత్తం తనలాగే తయారవ్వాలని లోకేష్ కోరుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు రోజా. పరీక్షలు రద్దుపై లోకేష్ చేస్తున్న రార్థాతం చూస్తుంటే నవ్వు తెప్పిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు.
 
తినింది అరక్క ఏదో ఒకటి మాట్లాడుతూ.. జూమ్ మీటింగ్‌లో ఇష్టానుసారం ప్రభుత్వంపై ముద్దపప్పు లోకేష్ విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోని వాళ్ళందరినీ ముద్దపప్పు అవ్వాలని లోకేష్ పోరాటం చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 6 శాతానికి కరోనా తగ్గిందని కాబట్టి పరీక్షలపై నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోలేదన్నారు.
 
చందమామ అంటూ జగన్ మోహన్ రెడ్డిని పిల్లలు ప్రేమగా పిలుస్తున్నారని.. మెంటల్ మామలు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు, లోకేష్‌లేనన్నారు. పిచ్చి కామెంట్స్ చేయడం మానుకుంటే బాగుంటుందని రోజా హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments