Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుళ్లను కూల్చేసి బాత్రూమ్‌లు కట్టేసిన బాబును శివసేన ఎందుకు వదిలేసింది?: రోజా

శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే రాజకీయాలపై మాట్లాడుతున్నానా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతోమంది తిరుమ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (11:00 IST)
శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే రాజకీయాలపై మాట్లాడుతున్నానా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతోమంది తిరుమల కొండలపై.. పవిత్ర పుణ్యేక్షత్రమైన శ్రీవారి సన్నిధిలో రాజకీయాలపై మాట్లాడారని గుర్తు చేశారు. శివ‌సేన వాళ్ల‌కి తాను చెప్పేది ఒక్క‌టేన‌ని, తాను హిందూ సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తాన‌ని రోజా వ్యాఖ్యానించారు. 
 
గుళ్ల‌ను కూల్చేసి ఆ స్థ‌లాల్లో బాత్‌రూంలు క‌ట్టిన చంద్ర‌బాబు నాయుడిని కూడా శివ‌సేన వారు నిల‌దీసి ఉంటే తాము సంతోషించేవారమ‌ని రోజా విమర్శించారు. దేవినేని ఉమా మహేశ్వరావు నాలుగు రోజుల ముందే శ్రీవారి సన్నిధికి వచ్చి రాజకీయాలపై మాట్లాడారని రోజా తెలిపారు. 
 
టీటీడీ బోర్డులో ఎంతోమంది దొంగ‌లు అడ్డంగా దొరికిపోయారని రోజా అన్నారు. అంతేగాకుండా టీటీడీ బోర్డులో లిక్కర్ మాఫియా వాళ్లు కూడా ఉన్నారని రోజా ఎత్తిచూపారు. తిరుమ‌ల కింద ఎన్నో బెల్టుషాపులు ఉన్నాయ‌ని ఆమె ఆరోపించారు. ఇంత‌మందిని ప్ర‌శ్నించ‌ని శివ‌సేన తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిందని.. వారికో న్యాయం.. తనకో న్యాయమా అంటూ రోజా ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments