Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళని రెచ్చగొట్టడమే చంద్రబాబు పని, రోజా ఫైర్.?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (22:24 IST)
రోజా మరోసారి ఫైరయ్యారు. ప్రతిపక్షనేత నారాచంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అంటే ఒక విలువ ఉండాలి. కానీ ప్రస్తుత ప్రతిపక్షనేత మాత్రం ఏం చేస్తారో అర్థం కాదు. ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు.
 
రాష్ట్రప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై స్పందించాల్సిన చంద్రబాబు వాటిలో లేనిపోని లొసుగులను వెతుక్కుంటూ కావాలనే ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. చేనేత, పవర్ లూమ్స్ కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని.. అయితే కావాలనే చంద్రబాబు కార్మికులను రెచ్చగొట్టి తన ఇంటి ముట్టడికి కారణమయ్యారన్నారు.
 
పవర్ లూమ్స్ కార్మికులతో కలిసి కొంతమంది ప్రజా సంఘాలు తన ఇంటిని ముట్టడించాయని.. తాను ఇంట్లో లేనని పిఎ చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసునని.. అంతకుమించి తాను మాట్లాడనంటూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు రోజా. 
 
చంద్రబాబునాయుడులో ఇప్పటికైనా మార్పు కోరుకుంటున్నానని.. మార్పు వస్తే బాగుంటుందన్నారు. కరోనా సమయంలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నామని.. అలాగే చేనేత కార్మికులకు పథకాలన్నీ అందేవిధంగా చూశామన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments