Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి నోరు విప్పాలి: రోజా

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:06 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ ఉద్యమం ప్రారంభమైంది. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయకూడదంటూ ప్రజా సంఘాలన్నీ కదం తొక్కాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నాయి. అయితే ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
తిరుపతిలో మీడియతో మాట్లాడిన రోజా విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి ముందు మాట్లాడాలన్నారు. గతంలో బిజెపి నేతలే దీనిపై తీవ్రంగా స్పందించారని.. కాబట్టి వారే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయకుండా ఆపాలన్నారు. ఆ బాధ్యత బిజెపి రాష్ట్రనేతలు తీసుకుంటే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందన్నారు రోజా. 
 
అంతేకాకుండా విశాఖ ఉక్కుపై వైసిపి ముందు నుంచి ఒకే స్టాండ్‌తో ఉందని, అయితే కావాలనే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం టిడిపితో పాటు మిగిలిన పార్టీలు మానుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments