Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ చేతిలో స్టీరింగ్.. మరో చేతిలో బీరు బాటిల్ ... గాల్లో కలిసిన నలుగురి ప్రాణాలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:00 IST)
అనంతపురం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురి ప్రాణాలు తీసింది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో బీరు బాటిల్‌తో డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలో గత అర్థరాత్రి జరిగింది. 
 
బెంగళూరువైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు కియా కంపెనీ ప్రధాన గేట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. 
 
మృతులను బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన మరో యువకుడిగా గుర్తించారు. యువతులను గుర్తించాల్సి ఉంది. కారు డ్రైవర్ బీరు తాగుతూ డ్రైవ్ చేస్తుండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments