Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌ఎంపీలూ.. ఇలాగైతే శిక్ష తప్పదు: వైద్య శాఖ హెచ్చరిక

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:44 IST)
జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలన్నారు. 

జిల్లాల్లో ఆర్‌ఎంపీలు కరోనాకు సంబంధించిన వైద్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆదేశాలను పాటించకుంటే ఆర్‌ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన ఓపీలు మాత్రమే నడుస్తాయని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రత్యేక ఓపీని నడిపించాలన్నారు. "గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలి. ఉత్తర్వుల్ని ఉల్లంఘించే  ఆర్.ఎం.పిలపై చర్యలు తప్పవు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేసింది.  4 రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు అందుబాటులో వున్నాయి" అని జవహర్‌రెడ్డి  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments