Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి అది వెన్నతో పెట్టిన విద్య... అచ్చెన్నాయుడికి కడుపు మంట.. రోజా

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:31 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనకి ధన్యవాదాలు చెపుతూ ఎమ్మెల్యే రోజా గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తనపై ఏడాది పాటు బహిష్కరణ వేటు వేయడాన్ని గుర్తు చేశారు. సంప్రదాయాలు, విలువలు పాటించకుండా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె విమర్శించారు.
 
స్పీకర్ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు రాకపోవడం అనేది మిమ్మల్ని అగౌరవపరిచినట్లేనని అభిప్రాయపడ్డారు. మిమ్మిల్ని చూస్తుంటే మీ జిల్లా నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు కడుపు మంటగా వున్నట్లుగా వుంది. చెవిరెడ్డి గాపు బంట్రోతు అన్నందుకే అంతగా గుంజుకుంటున్నారు... తెదేపా నాయకులు చేసిన పనులకు ఎన్ని రోజులు గుంజీలు తీసి లెంపకాయలు వేసుకున్నా తప్పులేదు.
 
ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు శాసనసభ్యులు. వారి ఆశలను సాకారం చేసేందుకు మీ అనుభవంతో సభను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నాను. దేశం అంతా ఇటువైపే చూస్తోంది. సభలో విలువలు గురించి తెదేపా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. అని రోజా అన్నారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments