Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకేమైనా సమస్యలున్నాయా? రైతులను అడిగిన రోజా

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (20:24 IST)
చిత్తూరుజిల్లా నగరిలో రైతు భరోసా ప్రధాన గోదామును ప్రారంభించారు ఎమ్మెల్యే రోజా. రైతు రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఎంతో సంతోషంతో ఆమె రైతులతో మాట్లాడారు. మీకేమన్నా సమస్యలున్నాయా అంటూ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. రైతు ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవంటూ రైతులు చెప్పడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజా.
 
తన సొంత నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. లాక్ డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకున్న రోజా ఇప్పుడు రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన నేపథ్యంలో నగరిలోను రైతు భరోసా కేంద్రానికి శ్రీకారం చుట్టారు రోజా.
 
రైతులకు తక్కువ ధరకే విత్తనాలను పంపిణీ చేయడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రోజా చెప్పారు. రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments