Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (10:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో తూర్పు దిశనుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా 39 డిగ్రీలుగానమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. 
 
రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీల నుంచి 39.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో 39 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
గాలిలో తేమ 27 నుంచి 82 శాతం వరకు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
 
అలాగే వారం రోజుల కిందటి వరకు చల్లగాలులు, పొగ మంచు దుప్పట్లు కప్పుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అప్పుడే భానుడు భగభగమనిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments