Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో రిక్షా కార్మికునికి తీవ్ర గాయాలు, మానవత్వం చాటుకున్న కంచికచర్ల ఎస్సై రంగనాథ్

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (22:08 IST)
కంచికచర్ల చెరువు కట్ట సమీపంలో ఆదివారం రాత్రి రిక్షా కార్మికుడిని టిప్పర్ లారీ ఢీ కొట్టిన ఘటనలో రిక్షా కార్మికుడు కావాట్టి పుల్లయ్య (50) తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కంచికచర్ల ఎస్సై ఎంపీఎస్ఎస్ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న పుల్లయ్యను చేతిలోనికి తీసుకొని తలకు తగిలిన గాయాన్ని చేతి రుమాలుతో మూసి రక్తస్రావాన్ని ఆపారు.
 
పుల్లయ్య అపస్మారక స్థితిలోకి చేరుకోకుండా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన రహదారి అంబులెన్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పుల్లయ్యను చికిత్స నిమిత్తం నందిగామ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
 
ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది సరిచేసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం చూపించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీ కాగా టిప్పర్‌ను కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments