Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం అడిగిన రెవెన్యూ అధికారి.. అడ్డంగా బుక్ చేసిన రైతు..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:23 IST)
లంచం అడిగిన అధికారులను రైతు అడ్డంగా బుక్ చేశాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. రైతు భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు రూ 23 వేలు లంచం అడిగారు రెవెన్యూ అధికారులు. కడ్తాల్‌కు చెందిన రైతు ఎర్రోళ్ల వెంకటేశ్‌ తన పొలంలో షెడ్డు నిర్మించాలనుకున్నాడు. ఇందుకు రుణం పొందడానికి బ్యాంక్ అధికారులను సంప్రదించారు. 
 
రుణం ఇవ్వాలంటే భూమికి సంబంధించిన ఎన్వోసీ తీసుకురావాలని బ్యాంక్ అధికారులు సూచించారు. గతేడాది భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో వెంకటేశ్‌ ఎన్వోసీ కోసం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కడ్తాల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 1.25 గుంటల భూమికి ఎన్వోసీ మంజూరు చేయడానికి ఆర్‌ఐ శ్రవణ్‌కుమార్‌, నలుగురు సిబ్బంది రూ.23 వేలు లంచం అడిగారు. 
 
అది ఇచ్చుకోలేని రైతు ఏమి చేయాలో తోచక అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం రెవెన్యూ సిబ్బందికి రైతు లంచం ఇస్తుండగా. అనిశా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఐదుగురిపై కేసు నమోదు చేసారు. మంగళవారం వీరిని కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తనలాగే మరొకరికి జరగకూడదనే అనిశాని సంప్రదించానని రైతు చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments